Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదా ఇవ్వలేకే.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం : అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘హోదాతో సమానమైన సహాయం’ ఎలా ఉంటుంది? నిజంగానే ‘హోదా’లేని లోటు తీరుతుందా? అనే చ

Advertiesment
Arun jaitley
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘హోదాతో సమానమైన సహాయం’ ఎలా ఉంటుంది? నిజంగానే ‘హోదా’లేని లోటు తీరుతుందా? అనే చర్చ మొదలు కాగానే, దీనిపై ఆయన స్పందించారు. 
 
ప్రత్యేక హోదా లభిస్తే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్‌ఎస్‌) కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను గ్రాంటుగా, 10 శాతం రుణం రూపంలో ఇస్తుంది. ఈ పది శాతం రుణాన్ని మాత్రం రాష్ట్రం తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు హోదా లేదు కాబట్టి... సీఎస్‌ఎస్‌ కింద కేంద్రం 60 శాతం నిధులు ఇస్తోంది. ప్రత్యేక హోదా అమలైతే మరో 30 శాతం నిధులు అదనంగా వస్తాయని తెలిపారు. ఒక అంచనా ప్రకారం అవి యేడాదికి రూ.3 వేల కోట్లు వరకు ఉంటాయి. ఈ నిధుల్ని నగదు రూపంలో చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవ సభ నేడే... కాకినాడలో భారీ ఏర్పాట్లు