Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29 నుంచి అరకు ఉత్సవ్‌

29 నుంచి అరకు ఉత్సవ్‌
, సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (08:18 IST)
గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో ‘అరకు ఉత్సవ్‌–2020’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా\ మాట్లాడుతూ..  అరకు ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత పొందిందని, ఈ ఉత్సవాల ద్వారా దేశ విదేశాలకు చెందిన మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ఉత్సవాలకు నోడల్‌ అధికారిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ వ్యవహరిస్తారన్నారు. 

ఏజెన్సీలోని యువత ఎంతో ఆలోచనాశక్తి కలవారని, వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. గిరిజన యువతకు పర్యాటక శాఖలో మరిన్ని  ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 15న హైదరాబాద్‌లో సీఏఏ అనుకూల సభ