Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

Advertiesment
Araku

సెల్వి

, శుక్రవారం, 27 డిశెంబరు 2024 (19:33 IST)
Araku
లోయలు, కొండ ప్రాంతాల అందాలు సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ భూమిపై స్వర్గధామంగా భావిస్తారు. ప్రకృతి వైభవానికి ఆశ్చర్యపోయేలా చేస్తుంది. జనవరి 31, 2025 నుండి అరకు ఉత్సవ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
మూడు రోజుల ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక ఆటలు, క్రీడలు మరెన్నో ఉంటాయి. 2014లో, ఈ ప్రదేశాన్ని ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించిందని గుర్తుచేసుకోవచ్చు. తరువాతి ఐదు సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఉత్సవ్ తప్పకుండా నిర్వహించబడింది.
 
2019లో, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, దానిని పక్కన పెట్టారు. తిరిగి ఏపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వం మరోసారి అరకు ఉత్సవ్ నిర్వహణను ప్రారంభించాలని ప్రణాళిక వేసింది. 
 
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, హాట్ ఎయిర్ బెలూన్, రంగోలి పోటీలు, అనేక ఆటలు నిర్వహించబడతాయి. ధిమ్సా, కోయ, పులి వేషాలు అనే గిరిజన నృత్యాలు కూడా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు లోయకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ