Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెత్త ఎత్తేకొద్దీ కరెన్సీ నోట్ల కట్టలు ... ఎక్కడ?

చెత్త ఎత్తేకొద్దీ కరెన్సీ నోట్ల కట్టలు ... ఎక్కడ?
, మంగళవారం, 30 మార్చి 2021 (12:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చెత్త కుండీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. 
 
తాడేపల్లిలో పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఉండవల్లి సెంటరులోని ఎస్బీఐ వద్ద చీపుర్లు పట్టి చెత్తను ఓ వైపునకు ఊడ్చి ఎత్తుతున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500 నోటు కనిపించింది. అదృష్టం బాగుందని దానిని తీసి దాచారు. చెత్త ఎత్తే కొద్దీ నోట్లు దొరుకుతూనే ఉన్నాయి. 
 
ఏంటా అని మొత్తం చెత్త తీసే సరికి దాదాపు 30 దాకా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ నోట్ల కట్టలను చూసి భయపడిపోయిన పంచాయతీ కార్మికులు.. వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి ఆ నోట్లను పరిశీలించి చూశారు. దొంగనోట్లు అనుకున్నారు. 
 
కానీ, కట్టలన్నింటినీ క్షుణ్ణంగా చూస్తే.. దాని మీద చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ స్కూల్ జోన్ అని రాసి ఉంది. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. మళ్లీ ఆ ‘పిల్లల నోట్ల’ కట్టలను చెత్తలో వేసేసి డంప్ యార్డుకు పంపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ సోకి తీవ్రమైన లక్షణాలు ఉంటేనే బెడ్ కేటాయింపు.. ఎక్కడ?