Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమం : ఏపీ మంత్రి సురేష్

Advertiesment
ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమం : ఏపీ మంత్రి సురేష్
, గురువారం, 24 ఫిబ్రవరి 2022 (18:45 IST)
ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉక్రెయిన్, రష్యా దేశాలమధ్య యుద్ధం జరుగుతుంది. ఇది భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులపై విదేశీ విద్యార్థులు, ప్రజలు, దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, తెలుగు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులపై ఏపీ మంత్రి సురేష్ ఫోనులో మాట్లాడారు. వారంతా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. తెలుగు విద్యార్థుల కోసం సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. 
 
విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని వెల్లడించారు. విద్యార్థుల కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్టు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని ఆయన వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ అండగా ఉండాలి.. ప్రధాని మోడీ చెబితే పుతిన్ వింటారు.. ఉక్రెయిన్ రాయబారి