Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త‌ప్పుల్లేకుండా జీతం బిల్లులు... త‌యారీ అంత సులువు కాదు!

త‌ప్పుల్లేకుండా జీతం బిల్లులు... త‌యారీ అంత సులువు కాదు!
విజ‌య‌వాడ‌ , గురువారం, 27 జనవరి 2022 (12:12 IST)
ఏపీలో ఇపుడు పాల‌నా ప‌ర‌మైన ప్ర‌తిష్ఠంభ‌న కొనసాగుతోంది. ఒక‌టో తారీఖున ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల‌ను చెల్లించాలి. దీనికి సాల‌రీ బిల్లుల‌ను ట్రెజ‌రీ ఉద్యోగులు త‌యారు చేయాలి. కానీ, వారంతా ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు కొత్త పిఆర్ సికి అనుగుణంగా బిల్లులు తాము త‌యారుచేయం అని మొండికేశారు. దీనితో ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ, ఆ బిల్లులు త‌యారు చేయ‌డం అంత సలువు ఏమీ కాదంటున్నారు ఉద్యోగులు.
 
 
కొత్త పీఆర్సీ అమల్లో భాగంగా తప్పుల్లేకుండా బిల్లులు రూపొందించాలని, డీడీవోలు పంపించిన వివరాలను ఖజానా, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగాల్లోని అధికారులు సరిచూసుకొని సమర్పించాలని ఇప్పటికే ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తప్పులు జరిగితే బాధ్యత వహించడంతో పాటు చర్యలకూ సిద్ధపడాలని హెచ్చరికలు వెళ్లాయి. 
 
 
ప్రతి ఉద్యోగి ఎస్‌ఆర్‌ను పరిశీలించాలి. ఇంక్రిమెంట్లు చేర్చడం నుంచి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని వేతన స్థిరీకరణ చేయాలి. ఇందుకు మార్చి 31 వరకు ప్రభుత్వమే గడువు ఇచ్చింది. అయినా ఆర్థిక శాఖ ఖ‌జానా ఉద్యోగుల‌ను తొందర పెడుతోంది. ఇంత హడావుడిగా వేతన స్థిరీకరణ చేస్తే,  భవిష్యత్తులో మేం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఖజానా విభాగం ఉద్యోగులు వాపోతున్నారు. కొత్త పి.ఆర్.సి. ప్ర‌కారం బిల్లులు చేస్తే, తోటి ఉద్యోగుల‌కు కోపం, చేయ‌క‌పోతే ప్ర‌భుత్వానికి కోపం అన్న‌ట్లు త‌యార‌యింది...ఆర్ధిక‌శాఖ‌ ఖ‌జానా ఉద్యోగుల ప‌రిస్థితి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్‌పై 8 రోజులు - ఇది ఒమిక్రాన్ ఆయుష్షు