Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెమిడెసివిర్ మందులు నిల్వచేసివుంటే ఉక్కుపాదమే : డీజీపీ

రెమిడెసివిర్ మందులు నిల్వచేసివుంటే ఉక్కుపాదమే : డీజీపీ
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (21:58 IST)
రెమిడిసివేర్  నిల్వలు - వినియోగం, ఆక్సిజన్ నిల్వలు - వినియోగం, ఫీజుల పేరిట దోపిడీ మొదలైన పలు అంశాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు ఏపి డి‌జి‌పి గౌతం స‌వాంగ్ తెలిపారు. ముఖ్యంగా రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామ‌ని హెచ్చరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 
 
రెమిడిసివేర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లలో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100కు, 1902కు ఫోన్ చేయాల‌ని సూచించారు. కోవిడ్ రోగుల నుండి ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజు లపై ఆరా తీస్తున్నాం అన్నారు. పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అటువంటి సమాచారాన్ని డయల్ 100, 1902 ద్వారా చేరవేయాల‌న్నారు.
 
ఆక్సిజన్  వాహనాలకు రవాణా పరమైన ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు కోసం రాష్ట్ర స్థాయి మరియూ జిల్లా స్థాయి నోడల్ ఆఫీకారులు నియమించిన‌ట్లు డి‌జి‌పి పేర్కొన్నారు. ఇతర శాఖలతో సమన్వయం కోసం  కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారుల నియామకం చేసిన‌ట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలను తూఛా తప్పకుండా పాటించాల‌ని డీజీపీ హితవు ప‌లికారు. 
 
అమ‌రావ‌తి క్రైం, సెల్ఐటి న్యూస్‌..  మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధిస్తామ‌న్నారు. రాత్రి పూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు చేస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో కరోనాపై అవాస్తవాలు, పుకార్లను ప్రచారం చేస్తే చట్టపర‌మైన చర్యలు తీసుకుంటామ‌ని డి‌జి‌పి గౌతం స‌వాంగ్ హెచ్చ‌రించారు. కోవిడ్ ఆసుప‌త్రుల‌పైన సోష‌ల్ మీడియాలో కొందరు అవాస్తవాలు వ్యాపింపచేస్తున్నార‌ని అటువంటి శక్తులపైనా నిఘా ఉంచామ‌న్నారు. ముఖ్యంగా ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాల‌ని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత్రికేయల కోవిడ్ సేవలకు నోడల్ ఆఫీసర్ నియామకం!