Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్కీ నెంబర్ 8, సచివాలయంలోకి జగన్ జూన్ 8న.... (video)

Advertiesment
AP CM
, శుక్రవారం, 31 మే 2019 (16:38 IST)
సెలబ్రిటీలకు లక్కీ నెంబర్లంటే మహాగురి. ముఖ్యంగా ఈ విషయంలో రాజకీయ నాయకులు, సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పనికి గుమ్మడికాయలు పగులగొట్టడాలు, దిష్టి తీయడాలు చేస్తూనే లక్కీ నెంబర్లను చూసుకుని మరీ పని ప్రారంభిస్తారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ దోవలో నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
ఏప్రిల్ 30వ తేదీన ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేసిన జగన్ మోహన్ రెడ్డి, వచ్చే నెల 8న సచివాలయంలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టు జగన్ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల్లోగా సెక్రటేరియట్లో తన ఛాంబర్లో వైఎస్ జగన్ అడుగు పెట్టనున్నారు.
 
అదేరోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి, ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేరుకే ప్రొఫెసర్.. కోరిక తీర్చితే మార్కులేస్తానన్నాడు..