అచ్చెన్నాయుడికి హోం... లోకేష్ బాబుకు బెర్త్...?
విజయవాడ : మరికొద్ది రోజుల్లో ఏపీ కేబినెట్ విస్తరణ జరుగనుంది. ఇందులో రాష్ట్ర హోంమంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడికి అవకాశం కలిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ యువనేత లోకేష్ బాబుని మంత్రివర్గంలోకి తీసుకొనున్నట్లు సమాచారం. ముస్లింలకి మంత్ర
విజయవాడ : మరికొద్ది రోజుల్లో ఏపీ కేబినెట్ విస్తరణ జరుగనుంది. ఇందులో రాష్ట్ర హోంమంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడికి అవకాశం కలిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ యువనేత లోకేష్ బాబుని మంత్రివర్గంలోకి తీసుకొనున్నట్లు సమాచారం. ముస్లింలకి మంత్రి పదవి ఇస్తానని సీఎం హామీ నేపథ్యoలో వైసీపీ నుంచి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్బాషాకి మంత్రివర్గంలో అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ నుంచి వచ్చిన కాపు నేత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేలు మోదగుల వేణుగోపాల్ రెడ్డి, ధూళిపాల నరేంద్రకు అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీలు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్లకు అవకాశం కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన్కి ఈసారి మంత్రి పదవి ఖాయం అంటున్నారు. ఇక వైసీపీ నుంచి తేదెపాలో చేరిన కర్నూలు జిల్లా భూమా కుటుంబం నుంచి ఎమ్మెల్యే అఖిలకు ఛాన్స్ ఉందని చెపుతున్నారు.
భూమా నాగిరెడ్డి గత కొద్ది రోజూలుగా తెదెపా మీద అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యoలో మంత్రి పదవి వస్తుందా అనే సందేహo నెలకొంది. కానీ, భూమా కుటుంబంలో ఒక్కరికి మంత్రి పదవి కన్ఫర్మ్ అంటున్నారు రాయలసీమ తెదెపా నేతలు. ఇప్పటికే మంత్రి పదవి రేసులో ఉన్న మరికొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత వద్ద తమ ప్రొఫైల్లు ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్ బాబుని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కాకా పడుతున్నారు. అయితే, తమ అధినేత చంద్రబాబు మనస్సులో ఏమున్నదో చివరిదాకా తెలుసుకోలేమని పార్టీ పెద్దలే చెపుతున్నారు.