Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు : ఈ నెల 7, 8 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన!!

narendra modi

ఠాగూర్

, గురువారం, 2 మే 2024 (08:33 IST)
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ముమ్మరంగా ప్రచారం సాగుతుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేబీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో కూటమి అభ్యర్థుల విజయం కోసం బీజేపీ అగ్ర నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకసారి రాష్ట్రానికి వచ్చారు. తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీజేపీ బుధవారం ప్రధాని ఎన్నికల ప్రచార పూర్తి షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. 
 
7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రికి చేరుకుని ఎన్డీయే ఎంపీ అభ్యర్థి, బీజేపీ, రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తరపున  వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగింస్తారు. అలాగే, సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరధిలోని రాజుపాలెం సభలో ప్రధాని పాల్గొంటారు. 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు పీలేరు సభకు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి సర్కిల్ వరకు ఆయన రోడ్‌షో నిర్వహిస్తారు. 

నేను పారిపోను.. మీరు ధైర్యంగా ఉండాలి.. తిరగబడాలి : పవన్ 
 
ఒక సమస్యపై ధైర్యంగా నిలబడాలి. పోరాడాలి. తిరగబడాలి అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేనున్నాను కదా... నేను పని చేస్తా.. ఈ ఇద్దరితో పని చేయిస్తా.. ఈ మేరకు హామీ ఇస్తున్నా.. నేను పారిపోను.. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? అని పవన్ వ్యాఖ్యానించారు. 
 
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో బుధవారం వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొన్నారు. ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని మార్చండి.. తీసుకెళ్లి తుంగలో తొక్కండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. మార్చుదాం.. సంకల్పిద్దా.. బలమైన భవిష్యత్‌ను నిర్మించుకుందాం అని పేర్కొన్నారు. 
 
మీకు జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదు. ఉపాధి అవకాశాలు కల్పించలేదు. అతడికి ఓటేస్తారా? మరి ఏం చేద్దాం.. జగన్‌ను గద్దె దించుదాం.. మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం... ఒక సమస్యపై  ధైర్యంగా నిలబడాలి, తిరగబడాలి అంటూ పిలుపునిచ్చారు. 
 
పనిలోపనిగా జగన్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఏ మూలకు వెళ్లినా భూ కబ్జా బాధితులు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లతో ఉందన్నారు. దీనిపై మాట్లాడాల్సింద.. చొక్కా పట్టి నిలదీయాల్సింది ప్రజలేనని, ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడితేనే మార్పు తథ్యం అని పవన్ అన్నారు. అంతేకానీ, ప్రసంగిస్తుంటే ఎరుపు కండువాలు విసిరితే  ప్రయోజనం లేదని పవన్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారెవ్వా చంద్రబాబు దూరదృష్టి అదుర్స్.. "విజన్ 2047"పై ప్రశంసలు