Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2018లో జరిగిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

Advertiesment
2018లో జరిగిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఠాగూర్

, బుధవారం, 13 మార్చి 2024 (15:09 IST)
గత 2018లో జరిగిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మెయిన్స్ పేపర్‌ను రెండు సార్లు మూల్యాంకనం చేయించుకుంటూ పిటిషన్ దాఖలైంది. పైగా నచ్చిన వారిని ఎంపిక చేసి ఫలితాలను ప్రకటించారని ఆరోపించారు. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెయిన్స్ జవాబు పత్రాలను చేతిలో దిద్దే (మాన్యువల్) విధానం ద్వారా రెండుసార్లు మూల్యాంకనం చేశారని, కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి మూల్యాంకనం చేసిన ఫలితాలను పక్కన పెట్టి, రెండోసారి మళ్లీ మూల్యాంకన చేయించి వచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలను ప్రకటించిందని పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. 
 
మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశించింది. మళ్లీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని, ఆరు వారాల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై గ్రూపు-1 ద్వారా ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ చేసిన మోసానికి నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్