Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్రమ సంబంధం.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక....

Advertiesment
Anantapur
, సోమవారం, 24 ఆగస్టు 2020 (15:37 IST)
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషాదకర ఘటన ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం, సీసీకొత్తపేట బస్టాప్ వద్ద జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన అంజలి అనే మహిళకు మహేంద్ర అనే వ్యక్తితో పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
అయితే, అంజలికి తమ సమీప బంధువైన యోగానంద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలిసి ఇరువరిని మందలించడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇకపై తామిద్దరం కలుసుకోలేమని భావించి వారిద్దరూ ఇంటి నుంచి గత శుక్రవారం పారిపోయారు. 
 
ఆ మరుసటి రోజు శనివారం సీసీకొత్తపేట బస్టాప్‌ సమీపంలో పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి వారిని ధర్మవరం దవాఖానకు తరలించగా అంజలి మృతి చెందింది. యోగానంద్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తి పంచి ఇవ్వలేదనీ.. బావతో కలిసి తండ్రిని హత్య చేసిన కొడుకు?