Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంతలో దారుణం: బాలికను 3 రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారం..

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు మూడు రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులతో ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశ్రయించారు. ఈ

అనంతలో దారుణం: బాలికను 3 రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారం..
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (11:35 IST)
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు మూడు రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులతో ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశ్రయించారు. ఈ ఘటనపై నిందితుల నిర్భయ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. గుత్తి జంగాలకాలనీకి చెందిన 13ఏళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 5న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో రామాలయానికి వెళ్లింది. స్వామిని దర్శించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. 
 
కాగా, బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌లు ఆ బాలికను అడ్డుకుని, నోటిలో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే తల్లిదండ్రులు బాలిక కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారని బాధితురాలు విలపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ నాడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం సబబే.. బయోపిక్‌లో వైస్రాయ్ ఘటన ఉండాలి: పురంధేశ్వరి