Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరూ కావాలన్న పెళ్లయిన ప్రేయసి... ఇద్దరు ప్రియులు ఆ పని చేసారు...

ఇద్దరూ కావాలన్న పెళ్లయిన ప్రేయసి... ఇద్దరు ప్రియులు ఆ పని చేసారు...
, శుక్రవారం, 25 జనవరి 2019 (22:32 IST)
సమాజంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొంతమంది యువతులు అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మరికొంతమంది వివాహిత మహిళలు కూడా అక్రమ సంబంధాలతో పండంటి కాపురాన్ని నిలువునా కూల్చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది.
 
పాంచాలీనగర్‌కు చెందిన అనూషకు 27 సంవత్సరాలు. స్థానికంగా డిగ్రీ చదివి సమయంలో అనూషకు ఇద్దరు ప్రియుళ్ళు ఉన్నారు. అనూషకు వివాహమై సంవత్సరం అవుతోంది. అయినా ప్రియుళ్ళను మాత్రం మరిచిపోలేదు. భర్తతో కలిసి ఉంటూనే ఇద్దరు ప్రియుళ్ళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తుండేది. 
 
ఇద్దరు ప్రియుళ్ళు సూరి, రాములు పూటుగా మద్యం సేవించి గొడవపడ్డారు. అనూషతో ఎవరో ఒకరు కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో అనూషను రేణిగుంటలోని ఒక నిర్మానుష్యమైన అపార్టుమెంటుకు తీసుకెళ్ళారు.
 
ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకో.. ఇద్దరూ వద్దు అంటూ పట్టుబట్టారు. తనకు ఇద్దరూ కావాలంటూ అనూష చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. రాము, సూరిలు ఇద్దరూ కలిసి అనూషను చంపి అపార్టుమెంట్‌లో ఉరివేసుకుందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం