Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13 ఏళ్ల చిన్నారిపై 8 నెలలుగా 80 మంది సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

gang rape
, బుధవారం, 20 ఏప్రియల్ 2022 (13:31 IST)
తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 13 ఏళ్ల చిన్నారిపై 8 నెలలుగా 80 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల యువతి దత్తత తీసుకుంటున్నట్లు నటించి.. ఆ చిన్నారిని  తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది ఓ మహిళ. 
 
ఎట్టకేలకు ఆ చిన్నారిని పోలీసులు ఆ నరక కూపం నుంచి సోమవారం బయటకు తెచ్చారు. గుంటూరులోని బ్రోతల్ హౌస్ నుంచి చిన్నారిని కాపాడి.. మొత్తం 80 మందిని అరెస్ట్ చేశారు. 
 
ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు, చిన్నారిని వ్యభిచారంలోకి దింపిన సవర్ణ కుమారినీ అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడు ప్రస్తుతం లండన్ లో ఉన్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధం వున్నవారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే టీడీపీలోకి భారీ వలసలు : గంటా శ్రీనివాస రావు