Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొలి రోజు అప‌శృతి... ప‌ద్మావ‌తి ఘాట్లో బాలుడి మృతి... రూ. 5 లక్షలు ప్రకటించిన సీఎం(వీడియో)

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడ పద్మావతి ఘాట్‌లో అడప కిరణ్‌ అనే ఆరేళ్ల బాలుడు నీళ్లలో పడి చనిపోయాడు. ఘాట్‌ వద్ద పిల్లలతో ఆడుకుంటూ నీళ్లలో పడిపోయాడు. స్నానం చేసేవాళ్ల కాళ్లకు తగలడంతో వారు బాలుడిని పైకి తీశారు. దీంతో విష

తొలి రోజు అప‌శృతి... ప‌ద్మావ‌తి ఘాట్లో బాలుడి మృతి... రూ. 5 లక్షలు ప్రకటించిన సీఎం(వీడియో)
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (20:49 IST)
విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడ పద్మావతి ఘాట్‌లో అడప కిరణ్‌ అనే ఆరేళ్ల బాలుడు నీళ్లలో పడి చనిపోయాడు. ఘాట్‌ వద్ద పిల్లలతో ఆడుకుంటూ నీళ్లలో పడిపోయాడు. స్నానం చేసేవాళ్ల కాళ్లకు తగలడంతో వారు బాలుడిని పైకి తీశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బాలుడి మృతితో ఘాట్లో బంధువుల రోద‌న‌లు మిన్నంటాయి. కాగా బాలుడు మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ఒక ఇల్లు, రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారూక్‌ను అమెరికా అధికారులు ఆపడంలో తప్పేంలేదు... అమెరికా గాయం అలాంటిది... కమల్