విజయవాడ : విజయవాడలో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఇది. రాయనపాడు వద్ద రైలు కింద పడి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో షహీనా, పర్వీన్ అక్కడికక్కడే మృతి చెందగా, మూడో అమ్మాయి రుక్విన్ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.
ఈ ముగ్గురి ఆత్మహత్య యత్నం వెనుక పెను విషాదమే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు కెపిహెచ్బికి చెందిన రఫీకి వీరు కుమార్తెలు. వారం క్రితం రఫీ అనుమానాస్పది స్థితిలో విజయవాడ పోరంకిలో మృతి చెందాడు. ఆయన మృతిపై పోలీసు విచారణ జరుగుతుండగా, ఇపుడు అతని కుమార్తెలు ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, వీరంతా అయిదుగురు అక్కాచెల్లెళ్లని, వీరిలో పెద్దామెకు పోరంకిలో వ్యక్తితో పెళ్లయినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే వీరి మృతికి కారణమని భావిస్తున్నారు. ఈ ముగ్గురు బీటెక్, ఎంసీఎలు చదివినట్లు తెలిసి... అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు.