Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బహిర్భూమికి వెళ్లిన బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితులు

బహిర్భూమికి వెళ్లిన బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితులు
, ఆదివారం, 15 మే 2016 (11:41 IST)
విజయవాడకు సమీపంలోని విద్యాధరపురంలో ఇద్దరు కామాంధులు రెచ్చిపోయారు. బహిర్భూమికి వెళ్లిన 15 యేళ్ళ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. వీరి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ బాలిక తన శీలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... గొల్లపూడి నేతాజీ నగర్‌ పోస్టాఫీసు కార్యాలయం రోడ్డులో ఉంటున్న బాలిక (15) 8వ తరగతి చదువుతుంది. ఈ బాలిక రాత్రి 7 గంటలకు ఇంటికి కొద్ది దూరంలోని చెట్ల పొదల్లోకి బహిర్భూమికి వెళ్ళింది. గొల్లపూడి కోయకాలనీకి చెందిన లక్ష్మణ్‌, యశ్వంత ఆ బాలికను బలవంతంగా ముళ్ళ చెట్లు పొదల్లోకి తీసుకుని వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
కుమార్తె ఇంటికి రాలేదని ఆమె తల్లిదండ్రులు వెతకగా, ముళ్ల చెట్లు పొదలలో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో ఇంటికి తీసుకుని వెళ్ళి కుమార్తెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఎన్నికలు పోటీ కాదు.. రెండు పార్టీల మధ్య పోరాటం : కేటీఆర్