Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్గమ్మ గుడిలో అవినీతి... 11 మంది ఉద్యోగుల తొలగింపు

Advertiesment
Kanakadurga Temple
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (10:42 IST)
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గుడిలో అవినీతికి అలవాటు పడిన 13 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుడిలో ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దాడులు చేసి, పలు కీలక పత్రాలను, అవినీతి ఆధారాలను గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను ఇవ్వగా, భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
సస్పెండ్ అయిన వారిలో ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం. ఇక వీరు దేవాలయం భూములు, షాపుల లీజు, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం, అన్నదానం, ప్రసాదాల తయారీ వంటి అన్ని చోట్లా అవినీతికి పాల్పడినట్టు తేలడంతో, అందరినీ తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు, రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ ప్రధాని శ్రీలంక పర్యటన.. గగనతలాన్ని ఉపయోగించుకోవచ్చు.. భారత్