Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీరు కొండపైన ఎన్టీఆర్ విగ్రహం.. 108 అడుగుల ఎత్తు.. స్మారక కేంద్రం కూడా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని నవ్యాంధ్రలో ప్రతిష్టించనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసే

Advertiesment
108 Feet
, శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:28 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని నవ్యాంధ్రలో ప్రతిష్టించనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 
 
ఇందుకోసం ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాలుగు ఆకృతులను శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పరిశీలించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత కృష్ణానది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. 
 
నీరుకొండ వైపు ఏర్పాటు చేయాలని.. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండటంతో విగ్రహం నీడ నీటిలో ప్రతిబింబించనుంది. అలాగే నీరు కొండ మీదే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, గ్రంథాలయాలు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాలను కూడా ఏపీ సర్కారు ఏర్పాటు చేయనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలి జనార్థన్ రెడ్డి 'కుడి భుజం'కు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం