Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భానుకిరణ్‌తో కలిసి 18 సెటిల్మెంట్లు చేశా: మంగలి కృష్ణ

Advertiesment
భానుకిరణ్
, బుధవారం, 23 మే 2012 (17:51 IST)
FILE
సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్‌తో కలిసి 18 సెటిల్మెంట్లు చేసినట్లు మంగలి కృష్ణ అంగీకరించాడు. సూరి హత్య కేసులో భాను కిరణ్‌కు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగలి కృష్ణను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

భాను కిరణ్‌తో కలిసి హంద్రీ - నీవా ప్రాజెక్టు కాంట్రాక్టర్లు వెంకట నర్సింహా రెడ్డి, ఎస్వీ రంగారెడ్డిలను బెదిరించి దాదాపు రూ. 1.20 కోట్లు వసూలు చేసినట్లుగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

భూవివాదాలకు సంబంధించి సెటిల్మెంట్లలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు విచారణ సందర్భంగా మంగలి కృష్ణ అంగీకరించాడు. కాగా మంగలి కృష్ణకు జూన్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అతడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu