Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

పాపం.. గెల‌వ‌డం కోసం అదే గెస్ట్ హౌస్‌కి వెళ్తున్న బాల‌య్య‌..!

Advertiesment
Balakrishna
, బుధవారం, 22 మే 2019 (15:57 IST)
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మ‌రికొన్ని గంట‌ల్లో రానున్నాయి. దీంతో అంద‌రిలో ఒకటే ఉత్కంఠ‌. అస‌లు జ‌ర‌గ‌నుంది..? ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయి..? కేంద్రంలో బీజీపీ మ‌ళ్లీ అధికారం కైవ‌సం చేసుకుంటుందా..? లేక కాంగ్రెస్ పార్టీ అధికారం ద‌క్కించుకుంటుందా..? ఇక ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా..? లేక జ‌గ‌న్ అధికారం కైవ‌సం చేసుకుని సిఎం అవుతారా..? అనే ఉత్కంఠ ఏర్ప‌డింది. 
 
ఎవ‌ర్ని క‌దిపినా ఇదే టాపిక్. దీంతో పాటు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అనే అంశంపై కూడా టీడీపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 
 
ఒకవేళ హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతే... టీడీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు ఆ పార్టీ చేజారని కంచుకోటను ఇతర పార్టీకి అప్పగించిన బ్యాడ్ రికార్డ్ బాలయ్య సొంతం అవుతుంది. 
 
ఈ నేపథ్యంలో హిందూపురం ఫలితం ఏవిధంగా ఉంటుందనే అంశంపై టీడీపీ శ్రేణులతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే ప్రతి విషయంలో సెంటిమెంట్లను ఫాలో అయ్యే హీరో బాలకృష్ణ... ఫలితాలు వెలువడబోయే మే 23న కూడా ఓ సెంటిమెంట్‌ను ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది.
 
 
 
ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే... 2014 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ... కౌంటింగ్ సమయంలో ఆర్డీటీ స్టేడియంలో బస చేశారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడే బస చేయనున్నారు. అంతేకాదు గత ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆయన రూమ్ నంబర్ 9లో ఉన్నారని... అందుకే ఈసారి కూడా అదే రూమ్‌లో బస చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. 
 
మొత్తానికి ఎన్నికల ఫలితాల రోజు కూడా సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్న బాలకృష్ణను విజయం వరిస్తుందో లేదో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు ఆగాల్సిందే. పాపం..బాల‌య్య ఆఖ‌రికి గెల‌వ‌డం కోసం ఇలా సెంటిమెంట్ ను న‌మ్ముకున్నాడ‌ట‌..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దలైలామాకు ఏమైంది? భక్తుల ఆందోళన.. భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్