Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం విశాఖ హవాలా.. వేలాది కోట్ల తరలింపు

విశాఖ హవాలా కుంభకోణంపై సీఐడీ అంచనాలు నిజమే అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం గుట్టు రట్టయినట్లేనని తెలుస్తోంది. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ కింది స్థాయిలో వ్యవహారం నడిపాడని, ఆయనకన్నా పై స్థాయిలో ప్రముఖులు, బడా వ్యాపార

Advertiesment
visakhapatnam
హైదరాబాద్ , మంగళవారం, 16 మే 2017 (05:07 IST)
విశాఖ హవాలా కుంభకోణంపై సీఐడీ అంచనాలు నిజమే అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం గుట్టు రట్టయినట్లేనని తెలుస్తోంది. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ కింది స్థాయిలో వ్యవహారం నడిపాడని, ఆయనకన్నా పై స్థాయిలో ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకర్ల పాత్ర ఉండవచ్చని సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటిదాకా వందల కోట్లకే పరిమితమైందనుకుంటున్న విశాఖ హవాలా కుంభకోణం విలువ రూ.వేల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. 
 
హవాలా కుంభకోణంలో 12 బోగస్‌ కంపెనీలను సృష్టించారని, 30 బ్యాంకు ఖాతాలను తెరిచారని, నకిలీ పాన్‌కార్డులు, డాక్యుమెంట్లను రూపొందించి మోసానికి పాల్పడ్డారని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ చెప్పారు. నిందితుడు మహేష్‌ ఆయా కంపెనీల ఉద్యోగులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి హవాలా సొమ్ముతో రూ.680.94 కోట్ల లావాదేవీలు నిర్వహించారని తెలిపారు. ఈ కంపెనీలు రూ.569.93 కోట్ల మేర విదేశీ మారకద్రవ్యాన్ని భారత్‌కు నష్టం కలిగించాయని చెప్పారు.
 
 అంతేగాక.. కోల్‌కతా బ్యాంకుల్లో మరో రూ.800 కోట్ల సొమ్మును జమ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారన్నారు. 2014 నుంచి మొదలైన ఈ వ్యవహారం పెద్దనోట్ల రద్దు వరకు వేగంగా సాగిందన్నారు. ఇప్పటిదాకా రూ.1,369 కోట్ల హవాలా కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చినా మున్ముందు ఇది వేల కోట్లకు చేరుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోవచ్చని అంటున్నారు.  
 
ఇప్పటిదాకా వందల కోట్లకే పరిమితమైందనుకుంటున్న విశాఖలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం విలువ రూ.వేల కోట్లు ఉంటుం దని ఏపీ  సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ కింది స్థాయిలో వ్యవహారం నడిపాడని, ఆయనకన్నా పై స్థాయిలో ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకర్ల పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ను సోమవారం ఉదయం కోర్టుకు తరలించగా రిమాండ్‌ విధించారు. సీఐడీ ఐజీ అమిత్‌గార్గ్‌ పర్యవేక్షణలో కేసు విచారణ ప్రక్రియ మొదలయింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్నటి వరకు మోదీ మంచివాడు.. నేడు అంటరానివారయ్యారా: జగన్ సూటి ప్రశ్న