Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు అంగీకరించాకే ప్యాకేజీపై ప్రకటన.. రాజకీయాలు వద్దు : వెంకయ్య నాయుడు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ప్యాకేజీని వివరించిన తర్వాతే ప్రకటన చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.

Advertiesment
Venkaiah naidu
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:28 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ప్యాకేజీని వివరించిన తర్వాతే ప్రకటన చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు తయారు చేసిన ప్యాకేజీ గురించి పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామన్నారు. 
 
ఈ ప్యాకేజీకి ఆయన అంగీకరించారని, ఆ తర్వాతే ప్రకటన చేశామని తెలిపారు. ప్యాకేజీని ఆయన స్వయంగా ఒప్పుకున్నారని, ఈ విషయంలో ఇక రాజకీయాలు చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఆపాలని కోరారు. రాష్ట్రానికి ఏం చేయాలన్న విషయమై రూ.1.60 లక్షల కోట్ల పనులు ఖరారయ్యాయని, మరో రూ.65 వేల కోట్ల విలువైన పనులకు కార్యరూపాన్ని కల్పించాల్సి ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థానెలో ఆర్పీఎఫ్ జవాన్లపై రేప్ కేసు...