Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ‌గ‌న్ ఇంత చిన్న వ‌య‌సులో ఇన్ని అబ‌ద్దాలు ఎలా చెబుతున్నాడో!

విజ‌య‌వాడ ‌: వైసీపీ అధినేత యాత్ర ప్రారంభించ‌డాన్ని తెలుగుదేశం నాయ‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. ఇది దొంగ‌ల యాత్ర అంటున్నారు. టీడీపీ నాయ‌కుడు వ‌ర్ల రామయ్య మాట్లాడుతూ, గడప గడపకు వైసీపీ పెరుతో నేరస్తులైన వైసీపీ నేతలు మీ ఇళ్ళ ముందుకు వస్తున్నారు... ప్రజలంతా జ

జ‌గ‌న్ ఇంత చిన్న వ‌య‌సులో ఇన్ని అబ‌ద్దాలు ఎలా చెబుతున్నాడో!
, బుధవారం, 6 జులై 2016 (18:50 IST)
విజ‌య‌వాడ ‌: వైసీపీ అధినేత యాత్ర ప్రారంభించ‌డాన్ని తెలుగుదేశం నాయ‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. ఇది దొంగ‌ల యాత్ర అంటున్నారు. టీడీపీ నాయ‌కుడు వ‌ర్ల రామయ్య మాట్లాడుతూ, గడప గడపకు వైసీపీ పెరుతో నేరస్తులైన వైసీపీ నేతలు మీ ఇళ్ళ ముందుకు వస్తున్నారు... ప్రజలంతా జాగ్రత్త అన్నారు. వైసీపీ అధినేత జగన్ దిక్కుతోచని పరిస్థితుల్లో గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపడుతున్నాడ‌ని, విమ‌ర్శించారు. 
 
కొన్ని అబద్దపు ప్రశ్నలు తయారుచేసి వాటిని గడప గడపకు తీసుకువెళ్ళి టీడీపీకి మార్కులు వెయ్యాలని కోరుతానంటూ జగన్ కొత్త నాటకానికి తెరతీస్తున్నాడ‌ని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజలు డిస్టింక్షన్ మార్కులు వేసారు కాబట్టే అధికారం చేపట్టి ప్రజా రాజధాని నిర్మిస్తున్నార‌ని, అధికారం చేపడతానని జగన్ ఇప్పటికీ దింపుడు కళ్ళం ఆశతో ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. 
 
33 వేల‌ కోట్లు విలువ చేసే రాజధాని భూములతో లక్ష కోట్లు అవినీతి జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడ‌ని ఆరోపించారు. జగన్ ఇంత చిన్న వయస్సులో ఇన్ని అబద్దాలు ఎలా చెబుతున్నాడో అర్ధం కావడంలేద‌న్నారు. ప్ర‌తిపక్ష నాయకుడిగా నీకు ఎన్ని మార్కులు వచ్చాయో ప్రజలను అడుగు. అప్పుడు నీకు కచ్చితంగా సున్నా మార్కులే వస్తాయ‌ని ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులు సరిపోవట్లేదు.. కానీ ప్యాకేజీలు ఇస్తున్నాం: బాబు