Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల మనిమంజరి అతిథి గృహంలో చోరీ...

తిరుమల మనిమంజరి అతిథి గృహంలో చోరీ...
, బుధవారం, 3 జులై 2019 (15:15 IST)
తిరుమల మనిమంజరి అతిథి గృహంలో బారి దొంగతనం జరిగింది. వైకాపా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బంధువులుగా చెపుతున్న వీరంతా హైదరాబాద్‌కు చెందిన భక్తులు. మొత్తం 13 మంది హైదరాబాద్ నుంచి తిరుమలకు వచ్చారు. వీరంతా కలిసి మనిమంజరి అతిథి గృహంలో ఓ గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగింది. 

సుమారు 80 తులాల డైమండ్ నగలు... రూ.2 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోనును అపహరణకు గురైంది. మని మంజరి అతిథి గృహం వద్దకు చేరుకుని విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు... పోలీసులు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు, బాబుకు తేడా ఉండాలి కదా: సీఎం జగన్