Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైజాగ్‌కు రానున్న టీసీఎస్-టాటా.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

nara lokesh

సెల్వి

, గురువారం, 10 అక్టోబరు 2024 (07:56 IST)
టాటా గ్రూప్ ప్రతినిధులతో భేటీపై ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- టీసీఎస్ రానున్నట్లు మంత్రి లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ఐటీ సదుపాయం 10,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని.. ఇప్పటివరకు ఏపీలో అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకటిగా నిలుస్తుందన్నారు నారా లోకేష్. 
 
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా వైజాగ్‌లో 10,000 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ సదుపాయాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించడం తనకు సంతోషంగా ఉందన్నారు.
 
వ్యాపారం చేయడంలో వేగం అనే నినాదంతో నడిచే కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 
 
ఏపీని భారతదేశంలో నంబర్-1 రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. వైజాగ్‌లో టిసిఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎన్‌డిఎ హయాంలో ఏపీకి మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం వుందని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్యానా- ఏపీ ఎన్నికలకు లింకు పెట్టిన జగన్.. మళ్లీ ఈవీఎంలపై నింద