Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్‌కు హిందూ మతమంటే నచ్చదు : శ్రీనివాసానంద సరస్వతి

Swami Srinivasananda Saraswati
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (08:37 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి హిందూమతమంటే ఏమాత్రం నచ్చదని అందుకే ఆయన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరుకాలేదని ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. 
 
ఇదే విషయంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందూమత సంప్రదాయాలను గౌరవించడం, హిందూ దేవాలయాలకు వెళ్లడం క్రైస్తవమత భావాలు కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్తు అధ్యక్షుడైన శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. 
 
కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉన్నప్పటికీ కాలు బెణికిందనే నెపంతో వెళ్లకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆ తర్వాత రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పార్టీ కార్యక్రమానికి ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. 
 
ఈ ముఖ్యమంత్రి గత నాలుగేళ్ళలో ఒక్కసారైనా సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకుగానీ భార్యతో కలిసి వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారా? అని ప్రశ్నించారు. పేరుకే హిందువు అని చెప్పుకునే సీఎం జగన్.. పక్కా క్రైస్తవ వాది అన్నారు. w

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోదరుడితో గొడవపడి.. చైనీస్ మొబైల్ ఫోన్ మింగేసిన అమ్మాయి