Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకొచ్చి....

Advertiesment
summer
, మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (09:42 IST)
వేసవిలో వచ్చే తుఫానులు అల్లకల్లోలం సృష్టిస్తుంటాయి. ఈసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫణి సోమవారంనాటికి మచిలీపట్నానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. ఈ తుఫాను మే 1 సాయంత్రం వరకు ఈశాన్య దిశగా పయనించి ఉత్తరాంధ్ర వైపుకి అతి సమీపంలోకి దూసుకు వస్తుంది.
 
ఈ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో మే 3న భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు ఒకటిరెండు చోట్ల మే 4న అతి భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు.
 
కాగా ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్రకు సమీపంలోకి వచ్చి ఆ తర్వాత తన దిశ మార్చుకుని ఒడిషా వైపుకి పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తమ్మీద ఫణి తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేనట్టే. ఐతే సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది కనుక చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లల కళ్లలో కారంచల్లి సవతి తల్లి మెడ నరికేసిన కానిస్టేబుల్