Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పాల్గొన్న పవన్ కళ్యాణ్

Advertiesment
pawan - gajendra

ఠాగూర్

, గురువారం, 26 జూన్ 2025 (12:57 IST)
ఏపీలోని రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కేంద్రం నిధులు రూ.375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. 
 
గోదావరి పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టును చేపడుతారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు  కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, గిడ్డి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, డిసిసిబి ఛైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో అమానుషం.. వాచ్‌మెన్ దెబ్బలు భరించలేక 17వ అంతస్తు నుంచి దూకేసిన శునకం..