Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయలచెరువుకు చిన్న లీకేజీ, అపాయం లేదు కానీ..?

రాయలచెరువుకు చిన్న లీకేజీ, అపాయం లేదు కానీ..?
, సోమవారం, 22 నవంబరు 2021 (19:28 IST)
గత రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలోని రాయలచెరువుకు పడిన గండి ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణమైనా చెరువు కట్ట తెగిపోతుందని గ్రామస్తులు ఊర్లకు ఊర్లు ఖాళీ చేశారు. 0.9 టిఎంసి సామర్థ్యం ఉన్న రాయలచెరువులో అధికంగా నీటి సామర్థ్యం ఉండడంతో కట్ట తెగే అవకాశముందన్న ఆందోళన నెలకొంది.

 
దీంతో రాయలచెరువు చుట్టుపక్కల ఉన్న సుమారు 16 గ్రామ ప్రజలను హుటాహుటిన అధికారులు తరలించారు. మూడు వేల మందికి పైగా గ్రామస్తులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే టీటిడి సహకారంతో తిరుచానూరులోని పద్మావతి నిలయం కూడా పునరావాస కేంద్రంగా మార్చుకున్నారు.

 
ప్రస్తుతం రాయల చెరువు వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఇసుక వేసిన తర్వాత గండి ఏమాత్రం పూడకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం సిమెంటు ఇసుక కలిపిన మిశ్రమాన్ని చెరువుకి పడిన గండి వద్ద కూలీలు వేస్తున్నారు.

 
సిమెంటు ఇసుకతో ఉన్న మిశ్రమం గండి దగ్గర వేయడం వల్ల గట్టిగా మారిపోయి నీరు బయటకు వెళ్లే ఉధృతి తగ్గుతుందన్న నమ్మకంతో అధికారులు ఉన్నారు. మూడు వందల మందికి పైగా కూలీలు శ్రమించి ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

 
ప్రస్తుతానికైతే రాయల చెరువు వద్ద ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోంది. వర్షం పడుతున్న పరిస్థితుల్లో వరద ఉధృతి పెరిగి చెరువు కట్ట ఏ క్షణమైనా తెగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైకోర్డులో జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తుందనే, యూ టర్న్!