Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్-2 పునఃప్రారంభం

Second Blast Furnace

ఠాగూర్

, సోమవారం, 28 అక్టోబరు 2024 (16:21 IST)
గత వైకాపా ప్రభుత్వంలో మూసివేసిన విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్‌-2ని తిరిగి పునఃప్రారంభించారు. ముడిసరుకు అందుబాటులోకి రావడంతో ఈ ఫర్నేస్‌ను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించారు. ఇది మంచి శుభపరిణామమని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ అధిరిక హ్యాండిల్‌లో ఓ ట్వీట్ చేసింది. 
 
'కుట్ర ప్రకారం, విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తన భార్య నడిపే కంపెనీ పార్టనర్‌కి అమ్మేయాలని స్కెచ్ వేసిన నాటి సైకో జగన్ రెడ్డి పాలనలో, స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-2ని ఆరు నెలల క్రితం మూసి వేశారు. గత వైకాపా ప్రభుత్వంలో ఓ పథకం ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తన భార్య నడిపే కంపెనీ భాగస్వామికి పార్టనర్‌కి అమ్మేయాలని స్కెచ్ వేసిన నాటి సైకో జగన్ రెడ్డి పాలనలో, స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-2ని ఆరు నెలల క్రితం మూసివేశారు.
 
ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేసేలా కేంద్రంతో చర్చలు జరిపింది. కేంద్ర ఉక్కు మంత్రి కూడా విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
 
నాడు జగన్ పాలనలో, మూతబడిన బ్లాస్ట్ ఫర్నేస్-2 సోమవారం పునఃప్రారంభం అయ్యింది. ముడిసరకు అందుబాటులోకి తెచ్చి, ఫర్నేస్-2 పునఃప్రారంభం కావటంతో ఉత్పత్తి పెరుగుతుందని, ఇది శుభపరిణామమని కార్మికులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జరిపింది. కేంద్ర ఉక్కు మంత్రి కూడా విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
 
నాడు జగన్ పాలనలో, మూతబడిన బ్లాస్ట్ ఫర్నేస్-2 సోమవారం పునఃప్రారంభం అయ్యింది. ముడిసరకు అందుబాటులోకి తెచ్చి, ఫర్నేస్-2 పునఃప్రారంభం కావటంతో ఉత్పత్తి పెరుగుతుందని, ఇది శుభపరిణామమని కార్మికులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు' అని చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ -మహిళ మృతి.. 20మందికి అస్వస్థత