Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా సేవలకు రోబో..ఎక్కడ?

Advertiesment
Robot
ఆధునిక యుగంలో అన్నింటికీ సాంకేతికతే. ఇప్పుడు కరోనా బాధితులకు సేవలందించేందుకు రోబోలను ప్రవేశపెడుతున్నారు.

తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోబో సేవలు ప్రారంభమయ్యాయి. చైతన్యం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన 'ఆర్‌బాట్‌-20' రోబో మిషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ చాంబర్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మందులు, భోజనం, వాటర్‌ బాటిల్స్‌ తదితర సామాగ్రిని అందించనుందన్నారు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌, చైతన్యం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేనెందుకు కారు దిగానంటే...? : విజయసాయిరెడ్డి వివరణ