Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం మత్తులో కూర్చున్న వ్యక్తిపై నాట్యం చేసిన కొండచిలువ (video)

Advertiesment
Python
మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై కొండచిలువ నాట్యం చేస్తోంది. నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్‌పై కొండచిలువ ఎక్కి దిగింది. 
 
పక్కనే పొదల్లో నుంచి వచ్చిన ఆ కొండచిలువ డ్రైవర్ పైకి ఎక్కి నాట్యం చేసింది. ఇంత జరిగినా ఏం జరగనట్లు మద్యం మత్తులో వున్న వ్యక్తి వుండిపోయాడు. 
 
అయితే దీన్ని గమనించిన గ్రామస్తులు షాక్ అయ్యారు. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేశారు గ్రామస్తులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందు బాధ్యతలు.. ఆ తర్వాతే విందులు.. వినోదాలు.. : డిప్యూటీ సీఎం పవన్ (Video)