Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక మాస్ రాజా వంతు... ఈడీ ఆఫీస్ కు చేరుకున్న హీరో రవితేజ!

Advertiesment
mass raja
విజయవాడ , గురువారం, 9 సెప్టెంబరు 2021 (12:02 IST)
మాద‌క ద్ర‌వ్యాల కేసులో మాస్ రాజా హీరో ర‌వితేజ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఈ రోజు   ఉద‌యం ప‌దిన్న‌ర‌కు ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. రవితేజ తో పాటు అత‌ని డ్రైవర్ శ్రీనివాస్ కూడా హాజర‌య్యాడు. నేరుగా త‌న ఫామ్ హౌస్ నుంచి ర‌వితేజ ఈడీ ఆఫీస్ కు వచ్చారు.  
 
హీరో త‌నీష్ నిర్వ‌హిస్తున్న‌ఎఫ్ క్లబ్ లో పార్టీలకు రవితేజ హాజ‌ర‌యిన‌ట్లు ఆరోపణలున్నాయి. దీనితో  టాలీవుడ్  డ్రగ్స్ కేసులో హీరో రవితేజను రెండో సారి ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఛార్మి, ర‌కుల్, పూరీ స‌హా సినీ ప్రముఖులు  ఐదుగురిని ఈడీ ప్రశ్నించింది. 
 
అయితే,  రెండు రోజుల నుంచి ఈడీ విచారణ రూటు మార్చినట్లుంది. మాద‌క ద్ర‌వ్యాల సూత్ర‌ధారి కెల్విన్ ఈడీకి స‌రెండ‌ర్ కావ‌డంతో కేసు మ‌లుపు తిరిగింది. ఈసారి కెల్విన్  తో పాటు హీరో రవితేజను విచారించే అవకాముంది. అంటే, ప్ర‌స్తుతం కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ కేసు విచారణ కొనసాగుతోంది. నిన్న కెల్విన్ తోపాటు రానాను విచారించిన అధికారులు, ఇవాళ కూడా కెల్విన్  సమక్షంలోనే ర‌వితేజ విచార‌ణ  కొనసాగించున్న‌ట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారం, మనీలాండరింగ్ పై ర‌వితేజ‌ను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం.. భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను..