Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌లో సిద్ధం చేయండి.. నారా లోకేష్

Advertiesment
Nara Lokesh

సెల్వి

, సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (22:40 IST)
ఆంధ్రప్రదేశ్ విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, జంట గోదావరి జిల్లాలు, కృష్ణ-గుంటూరు ప్రాంతానికి జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా నిర్ణయాత్మక విజయం సాధించాలని ఉద్ఘాటించారు.
 
ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రచార సమయం పరిమితంగా ఉండటం వల్ల ప్రతి ఓటరును చేరుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో లోకేష్ పేర్కొన్నారు. 
 
పోలింగ్ రోజు పార్టీ ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు ఓటర్లు పోలింగ్ బూత్‌లను సందర్శించి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసుకోవాలని నారా లోకేశ్ హైలైట్ చేశారు.
 
ఎన్నికల రోజు కార్యకలాపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి, లోకేశ్ కేంద్ర కార్యాలయంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ అభ్యర్థులకు అద్భుతమైన విజయాన్ని సాధించడానికి అన్ని కూటమి నాయకులు సమిష్టిగా పనిచేయాలని నారాలోకేష్ కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు