Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా మాటే శాసనం అడిగినన్ని టిక్కెట్లివ్వు, తిరుమలలో మంత్రుల హల్చల్..?

Advertiesment
Ministers
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (21:51 IST)
తిరుమలలో మంత్రులు హల్చల్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో సామాన్యులకు స్వామివారి దర్సనం దూరమవుతోంది. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు వారి అనుచరులకు ప్రోటోకాల్ మర్యాదలు జరుగుతున్నాయి. 
 
మొన్న 35 మందితో వచ్చారు మంత్రి వేణుగోపాలక్రిష్ణ. నిన్న 55 మందితో మరోమంత్రి గుమ్మనూరు జయరామ్ వచ్చారు. ఇక తమతో పాటు తమ అనుచరులకు ప్రోటోకాల్ దర్సనం కల్పించాలంటూ టిటిడి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు మంత్రులు. మంత్రుల ఒత్తిడికి టిటిడి అధికారులు తలొగ్గుతున్నారు.
 
దీంతో సామాన్యులకు ఒక న్యాయం మంత్రులకు మరో న్యాయమా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో మంత్రులతో పాటు అనుచరులు వచ్చిన దాఖలాలు లేవు.
 
అయితే కోవిడ్ తగ్గుముఖం పడుతుండడం.. దాంతో పాటు ఆఫ్ లైన్లో టోకెన్లు లేకపోవడంతో విఐపిల వెనుకాల వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇద్దరు మంత్రులు ఏకంగా 30 మందికి పైగా అనుచరులను వెంట పెట్టుకుని తిరుమలకు రావడం.. మా వారికి దర్సనం కల్పించాల్సిందేనంటూ టిటిడి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది. అయితే దీనిపై ముఖ్యమంత్రి ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొబ్బిలి కోటలోని రాజా వారి భాండాగారంలో భారీ ఆస్తులు