Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ఆంధ్రా పప్పు'' బ్రాండ్‌పై నారా లోకేష్ ఏమన్నారు..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ తప్పులు మాట్లాడటంపై ఇటీవల సోషల్ మీడియాలో సెటైర్లు పేలిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నెట్టింట్లో నారా లోకేష్‌కు ఆంధ్రా పప్పు అనే బ్రాండ్ కూడా ఉం

''ఆంధ్రా పప్పు'' బ్రాండ్‌పై నారా లోకేష్ ఏమన్నారు..?
, గురువారం, 3 ఆగస్టు 2017 (16:42 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ తప్పులు మాట్లాడటంపై ఇటీవల సోషల్ మీడియాలో సెటైర్లు పేలిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నెట్టింట్లో నారా లోకేష్‌కు ఆంధ్రా పప్పు అనే బ్రాండ్ కూడా ఉంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో నారా లోకేష్ స్పందించారు. గూగుల్ సెర్చ్‌లో ఏపీ పప్పు అని కొడితే లోకేష్ పేరు వస్తుందనే విషయం కూడా సరైన సమాధానం ఇచ్చారు. 
 
ఇలాంటి ప్రచారాల గురించి పట్టించుకోను. చేస్తే చేసుకోనివ్వండి. ఇంతకంటే ఇంకేమీ చేయలేరు. రెండు ఆర్టికల్స్, ప్రోగ్రాములు చేస్తారంతే. కానీ తానేం చేస్తున్నానో ప్రజలకు బాగా తెలుసునని.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోనని నారా లోకేష్ స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక కార్యకర్తల కోసం ఎన్నో చేశానని.. 2014-16లో ఎవరూ ఊహించని విధంగా 50 లక్షల మందిని క్రియాశీలక సభ్యులుగా తెలుగుదేశం పార్టీలో చేర్పించాను. 
 
2016-18లో 70 లక్షల మంది కార్యకర్తలను చేర్పించాను. ప్రమాదవశాత్తు మరణించిన తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్నాను. ఇంకా ప్రజల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 40లక్షల వీధి దీపాలు వంటి ఎన్నెన్నో చేశాను. పప్పుగాడైతే ఇవన్నీ చేస్తాడా? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. ఇప్పటివరకు గత 100 రోజుల్లో ఆన్ లైన్ ద్వారా 5000 ఫిర్యాదులు అందాయని.. వాటిలో 3,092 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్... ఏంటిది అధ్యక్షా...?