Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి నో చెప్పిన పెద్దలు.. ఇంటి నుంచి జంప్.. రైలు పట్టాలపై ప్రేమికులు!

lovers

సెల్వి

, శుక్రవారం, 18 అక్టోబరు 2024 (19:32 IST)
గుంటూరు జిల్లాలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో తమ ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఓ యువ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతులు పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేష్ (22), నందిగామ మండలం రుద్రవనంకు చెందిన శైలు (21)గా గుర్తించారు. 
 
ఈ జంట కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మహేష్ కుటుంబం వారి పెళ్లికి అంగీకరించిందని, అయితే శైలు కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా శైలు కుటుంబీకులు ఈ ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆ ప్రేమికులు దసరా పండుగ సందర్భంగా కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. 
 
శుక్రవారం పెదకాకాని రైలు పట్టాల వద్ద దంపతులు శవమై కనిపించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారి కుటుంబాలకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నకూతురిని వ్యభిచార రొంపిలోకి దించాలనుకుంది.. అయితే జరిగిందేంటంటే?