Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ పెళ్లి, భార్యను పుట్టింటికి పంపించి యువతితో ఎంజాయ్ చేస్తూ?

Advertiesment
Love marriage
, గురువారం, 3 అక్టోబరు 2019 (18:21 IST)
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రేమించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారు కొంతమంది బాగానే ఉన్నా మరికొంతమంది మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సంఘటనే కర్నూలులో జరిగింది. 
 
కర్నూలు జిల్లా జూపాడుకు క్రిష్ణ, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజకుమారికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. కర్నూలు నగరంలోనే కాపురం పెట్టాడు క్రిష్ణ. స్థానికంగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో క్రిష్ణ అకౌంటెంట్‌గా చేరాడు. 
 
ప్రేమ పెళ్ళి కావడంతో వీరు అన్యోన్యంగా కలిసి ఉండేవారు. నెలరోజులు బాగానే సాగింది. కడపకు వెళదామని, అమ్మానాన్నలను చూసొద్దామని క్రిష్ణను కోరింది రాజకుమారి. అయితే క్రిష్ణ అందుకు ఒప్పుకునేవాడు కాదు. కానీ ఆ తర్వాత ఆమె అడక్కముందే పుట్టింటికి వెళ్లమంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఈ మార్పును గమనించింది రాజకుమారి. భార్యను రానురాను దూరం పెడుతూ వచ్చాడు. 
 
నేను కడపకు వెళ్ళొస్తాను. మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది రాజకుమారి ఓ రోజు. సరేనన్నాడు క్రిష్ణ. నాలుగు రోజులు తరువాత వస్తానని చెప్పిన రాజకుమారి భర్తపై అనుమానంతో రెండు రోజుల్లోనే తిరిగి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చి చూసిన కుమారి షాక్ తిన్నది. తన ఇంటిలోనే భర్త వేరొక యువతితో కలిసి ఉన్నాడు. భర్తను నిలదీసింది. ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇలా చేస్తావా అంటూ ప్రశ్నించింది.
 
ఆగ్రహంతో ఊగిపోయాడు క్రిష్ణ. ఆమెను బ్లేడ్ తీసుకుని అతి దారుణంగా ఒంటిపై గాయాలు పెట్టాడు. క్రిష్ణ నుంచి తప్పించుకున్న రాజకుమారి నేరుగా తండ్రికి ఫోన్ చేసింది. రాజకుమారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రిష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతే జరిమానా కట్టాల్సిన పని లేదు... ఇలా చేస్తే చాలు