Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కేసును సీబీఐతో దర్యాప్తు చేయించండి: ఆదిత్య నాథ్‌ దాస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

Advertiesment
Investigate
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (14:48 IST)
ఏపి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు తన వద్ద ఉన్న ఆధారాలను సీఎస్ కు రాసిన లేఖకు జత చేసి పంపారు. ఫేక్ డాక్యుమెంట్ల తయారీలో... డీజీపి గౌతమ్ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ తదితరుల ప్రమేయానికి సంబంధించిన పత్రాలు కూడా జత చేశారు.

ఫేక్‌ డాక్యుమెంట్లను తయారు చేసి... వాటిని ఒరిజినల్‌ డాక్యుమెంట్లుగా  కోర్టులకు, ట్రైబ్యూనల్స్‌కు సమర్పించారని, ఇలా టాంపర్‌ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేసినట్లు మరికొన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేశారని వెంకటేశ్వరరావు తన లేఖలో ఆరోపించారు.

రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే, అనధికారిక ఉత్తర్వులు జారీ చేశారన్నారు...  ప్రభుత్వానికి తప్పుడు పత్రాలు పంపడం ద్వారానే తన సస్పెన్షన్‌కు సంబంధించి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకొనేలా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యులను కూడా బెదిరించారని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

య‌న‌మ‌ల చెత్త మాజీ ఫైనాన్స్ మినిస్ట‌ర్: విజ‌య‌సాయిరెడ్డి