Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెడ్ కావాలంటే రూ. 1,00,000 కట్టాల్సిందే, రోగుల బాధలు కరెన్సీ నోట్లుగా...

బెడ్ కావాలంటే రూ. 1,00,000 కట్టాల్సిందే, రోగుల బాధలు కరెన్సీ నోట్లుగా...
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:33 IST)
గుంటూరు జిల్లాలో పేరుగాంచిన ఆ ఆసుపత్రిలో బెడ్ కావాలంటే రికమండేషన్ తప్పనిసరి. దాంతో పాటే అక్షరాల లక్ష రూపాయల కడితే బెడ్ ఇస్తు రోజుకు 25 వేలు దండుకుంటున్న వైనం. ఇదంతా తెలిసినా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
 
రోగుల బాధలను కరన్సీగా మార్చుకుంటున్న ఇలాంటి వైధ్యశాలలో తనిఖీ ఉండదు. ఇది బహిరంగ రహస్యం. బాదితుల గోడును బహిరంగంగా చెబితే తక్షణమే బెడ్, రూమ్ వెంటిలేటర్ లేకుండా చేస్తారని భయం. డబ్బులు అప్పులకు తీసుకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలనే తాపత్రయం ప్రతిఒక్కరికి.
 
ఏమి చేస్తారు. డబ్బు కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. ఇది నిరూపణ కావాలంటే అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలకు చెందిన వారిని ఓదార్చి అడిగితే నిజం ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. కానీ బహిరంగ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుర‌క్షితంగా మూర్ఖ‌పురెడ్డి.. ల‌క్ష‌లాది పిల్ల‌ల్ని బ‌లి చేస్తారా?: నారా లోకేష్‌