Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపన్న కుటుంబం... కోటీశ్వర భర్త.. పరాయి పురుషుడిపై మోజు...

Advertiesment
Hyderabad
, బుధవారం, 5 డిశెంబరు 2018 (08:59 IST)
ఓ మహిళ పరాయి వ్యక్తి మోజులోపడి చివరకు కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్లాన్ చేసింది. చివరకు కట్టుకున్న భర్త చేతిలో ప్రియుడు హత్యకు గురికాగా, ఆ మహిళ మాత్రం జైలుపాలైంది. హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
నాగర్‌కర్నూలు జిల్లా, ఉరుకొండ మండలం, రచ్చలపల్లికి చెందిన గంగాపురం శ్రీధర్‌ రెడ్డికి అనే వ్యక్తికి అశ్విని అనే యువతితో గత 2009లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల చదువుకోసమని శ్రీధర్‌ రెడ్డి కల్వకుర్తి వచ్చి అద్దె ఇంట్లో ఉండగా.. అదే ఇంట్లోని పై అంతస్తులో శ్రీనివాస్ గౌడ్‌ తన భార్య, పిల్లలతో అద్దెకు నివశించేవాడు. 
 
ఈ క్రమంలో అశ్విని.. శ్రీనివాస్ గౌడ్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త శ్రీధర్ రెడ్డికి తెలిసి ఆమెను మందలించాడు. కానీ, ఆమె మాత్రం భర్త అడ్డు తొలగించుకుని ప్రియుడితో జీవించాలని పథకం వేసింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి తన స్నేహితులతో కలిసి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేశాడు. మిస్టరీగా మారిన ఈ హత్య కేసును హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించారు. 
 
నిజానికి, శ్రీధర్ రెడ్డిది సంపన్న కుటుంబం. ఒకే ఒక్క కుమారుడు. కోటీశ్వరుడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న అశ్విని కాపురం హాయిగా సాగిపోతోంది. కానీ, శ్రీనివాస్ గౌడ్ అనే పరాయి పురుషుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుని నూరేళ్ల జీవితాన్ని పాడుచేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతనో ఎగ్జిక్యూటివ్.. 11 మందితో 11 జిల్లాల్లో అక్రమ సంబంధం...