Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దివంగత రాజకీయ, సినీ నేతలకు గోదావరి పుష్కరాల్లో పిండ ప్రదానం...

Advertiesment
godavari pushkaralu
, శనివారం, 18 జులై 2015 (13:01 IST)
గోదావరి పుష్కరాల్లో దివంగత రాజకీయ, సినీ నేతలకు శనివారం ఉదయం పిండ ప్రదానం చేశారు. ప్రముఖ నటుడు, టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావుకు గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని పిండప్రదానం జరిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు, హస్తకళలు, వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిబాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 
 
ఎన్టీఆర్ చిత్రపటాన్ని ముందుంచుకుని సాయిబాబా పిండప్రదానం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కాని, టీడీపీ నేతలు కాని హాజరుకాలేదు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు విఐపి ఘాట్ లో హీరో, నిర్మాత ఆర్యన్ రాజేష్ తన తండ్రి ఇవివి సత్యనారాయణకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పుష్కర స్నానం అచరించారు.

Share this Story:

Follow Webdunia telugu