Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడివాడ క్యాసినో వివాదంపై సీఎం జ‌గ‌న్ స‌మాధాన‌మివ్వాలి

Advertiesment
cpi state secretary
విజ‌య‌వాడ‌ , సోమవారం, 24 జనవరి 2022 (09:59 IST)
కృష్ణా జిల్లా గుడివాడ‌లో మంత్రి కొడాలి నాని క‌ల్యాణ‌మండ‌పంలో కేసినో నిర్వ‌హించార‌నే వివాదంపై ఎంత‌సేపూ నేత‌లు మాట్లాడుతున్నారు గాని, పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడ‌టం లేద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ త‌ప్పుబ‌ట్టారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల‌ని రామకృష్ణ డిమాండు చేశారు. 

 
క్యాసినో ఎక్కడ జరిగినా? జరిగింది వాస్తవమా కాదా? విష సంస్కృతి ప్రోత్సహించినట్లా కాదా? అని ఆయ‌న విశ్లేషించారు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో క్యాసినో రచ్చ కొనసాగుతున్నా డిజిపి తీసుకున్న చర్యలేంటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్ర మంత్రిపై ఉన్న క్యాసినో అభియోగాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుడిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌ని లేదా అని ప్ర‌శ్నించారు. క్యాసినో నిర్వహించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌ని రామకృష్ణ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాస్‌ఏంజెల్స్‌లో కాల్పుల మోత - నలుగురి మృతి