Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులకు కరోనా

దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులకు కరోనా
, సోమవారం, 30 ఆగస్టు 2021 (09:30 IST)
కృష్ణాజిల్లా దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది దివిసీమలో విద్యార్థుల చదువుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. స్కూల్స్ తెరిచారనే ఆనందం ఒకవైపు, కరోణ దరికి చేరుతుందనే భయం మరోవైపు విద్యార్థులను వెంటాడుతున్నాయి.

పాఠశాల తెరిచి 15 రోజులు గడవక ముందే ఐదుగురు విద్యార్థులు కరోనా బారిన పడటం దివిసీమలో విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తుంది.

నాలుగు రోజుల క్రితం నాగాయలంక మండలం భావదేవరపల్లి ఎంపీపీ స్కూల్ లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకగా ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే కోడూరు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఒక విద్యార్థికి మోపిదేవి మండల పరిధిలోని మెరకన పల్లి ఎంపీపీ స్కూల్ లో మరో విద్యార్థి కరోనా బారిన పడ్డారు.

అంతేకాకుండా చిన్నారులకు ఇంకా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకపోవడంతో  దివిసీమలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలా వద్దా అనే మీ మాంసలో ఉన్నారు. మరో నెలలో కరోణ మూడవ దశ వస్తుందనే వైద్యనిపుణుల ముందస్తు ప్రకటన సైతం విద్యార్థుల చదువులు పై ప్రభావం చూపుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాలి: ఉపరాష్ట్రపతి