Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం చంద్ర‌బాబు డిడి ఇచ్చారు... బ్యాంకు వారు చెల్ల‌దు పొమ్మ‌న్నారు...

అనంత‌పురం : ప‌్ర‌తిభా పురస్కారాల్లో భాగంగా.. ఓ విద్యార్థినికి సీఎం చంద్రబాబు అందజేసిన చెక్కు చెల్లకుండా పోయింది. బ్యాంకు అధికారుల తప్పిదం వ‌ల్ల‌నే ఈ పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తోంది. బ్యాంకు అధికారులు చెక్కు చెల్లదని చెప్పడంతో... ప్రస్తుతం ఆ విద్

Advertiesment
Chandrababu naidu
, సోమవారం, 7 నవంబరు 2016 (16:53 IST)
అనంత‌పురం : ప‌్ర‌తిభా పురస్కారాల్లో భాగంగా.. ఓ విద్యార్థినికి సీఎం చంద్రబాబు అందజేసిన చెక్కు చెల్లకుండా పోయింది. బ్యాంకు అధికారుల తప్పిదం వ‌ల్ల‌నే ఈ పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తోంది. బ్యాంకు అధికారులు చెక్కు చెల్లదని చెప్పడంతో... ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆనందం కాస్త ఆవిరైనట్టయింది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నామకల్లు ప్రవలిక అనంతపురం ఎస్కే యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తిచేసింది. 
 
ఈ క్రమంలోనే 2016 సంవత్సరానికి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. అక్టోబర్ 13న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం, రూ.20 వేల డిడి అందజేశారు. డిడి తీసుకుని హిందూపురం ఆంధ్రా బ్యాంకుకు వెళ్లిన ప్రవళ్లికకు బ్యాంకు సిబ్బంది షాక్ ఇచ్చారు. డీడీపై తొలుత ప్రవళ్లిక అనే పేరుకు బదులు హారిక అనే పేరు ముద్రించిన హైదరాబాద్ సిండికేట్ బ్యాంకు సిబ్బంది. 
 
తప్పును సరిదిద్దడం కోసం హారిక పేరుపై బ్యాంకు సీల్ వేసి కనిపించకుండా చేశారు. దీంతో చెక్కు చెల్లదని తేల్చి చెప్పారు ఆంధ్రాబ్యాంక్ సిబ్బంది. చెక్కుచెల్లదని చెప్పడంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది ప్రవళ్లిక. ఇప్పుడు దాన్ని సరిచేయాలంటే హైదరాబాద్‌కు వచ్చి డిడి సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ విషయం అధికారులు స‌రిదిద్ది, ఆ విద్యార్థిని స‌హాయం అందించాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమలపై ఇక మహిళలకు ప్రవేశం.. కేరళ ప్రభుత్వం ప్రకటన