Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తినడానికి తిండి లేదుగాని అంబేద్కర్ విగ్రహం అవసరమా?: భూమా ప్రశ్న

Advertiesment
తినడానికి తిండి లేదుగాని అంబేద్కర్ విగ్రహం అవసరమా?: భూమా ప్రశ్న
, శనివారం, 16 ఏప్రియల్ 2016 (18:48 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన భూమా నాగిరెడ్డి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజున దళిత సంఘాల వారిని హేళన చేసినట్లు మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లాలోని బొమ్మల సత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 
 
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు నంద్యాలలో అంబేద్కర్ భవన్ నిర్మించాలని వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే వారి విన్నపం పట్ల భూమా ఆశ్చర్యకరంగా స్పందించారు. తినడానికి తిండి లేదుగాని సంద్యాల నది బొడ్డున అంబేడ్కర్ విగ్రహం కావాలా..? అని ప్రశ్నించారు. ఖరీదైన స్థలాలున్నా పద్మావతి నగర్‌లో అంబేద్కర్ భవన్ నిర్మాణం సాధ్యం కాదని భూమా తేల్చి చెప్పారు.
 
అయితే ఈయన సమాధానంపై దళిత సంఘాల నేతలు నొచ్చుకున్నారు. తినడానికి తిండి లేదుగాని సంధ్యాల నది బొడ్డున అంబేడ్కర్ విగ్రహం అవసరమా అన్న వ్యాఖ్యలు భూమా కు దళితుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే తేరుకున్న భూమా ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టుంటే ఉపసంహరించుకుంటానన్నారు.

Share this Story:

Follow Webdunia telugu