Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహా.. ఏమి వినయం : వైవీఎస్ ముందు మోకరిల్లిన ఏపీ మంత్రి

venugopalakrishna
, శనివారం, 30 ఏప్రియల్ 2022 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతున్నట్టు లేదు. అధికార పార్టీ నేతలకు ప్రజలు మోకరిల్లాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పదవులు దక్కినవారు మాత్రం వైకాపా పెద్దల వద్ద మోకరిల్లుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ తితిదే ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మోకారిల్లారు. వైవీఎస్ కాళ్ళ వద్ద తాను ఒక రాష్ట్ర మంత్రిననే విషయాన్ని విస్మరించి మోకరిల్లారు. 
 
కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ జరిగింది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి అనేక మంది వైకాపా నేతలు భారీ సంఖ్యలో వచ్చారు. వేదికపై వైఎస్ఎస్‌తో పాటు అనేక వైకాపా నేతలు ఆశీనులైవున్నారు. ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వేదికపైకి రాగానే వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ, చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించారని, అందుకు కారకులైన సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌కు ఎన్ని జన్మలైనా శెట్టి బలిజలుగా శిరస్సు వంచి నమస్కరిస్తానని వ్యాఖ్యానించారు. అయితే, ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ ఓ వ్యక్తి వద్ద మోకరిల్లడం ఇపుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరెంట్ - నీళ్లు లేవనే వ్యాఖ్యలు అన్యాపదేశంగా వచ్చాయి... మంత్రి కేటీఆర్