Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాడు కేసీఆర్‌‍ను బూతులు తిట్టి... నేడు అదే తప్పు చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని తేలిపోయింది. నలుగురికి నీతులు చెప్పే చంద్రబాబు.. చివరకు ఆ నీతికి, నైతిక విలువలకు కట్టుబడేందుకు ప్రయత్నం చేయడం లేదు.

నాడు కేసీఆర్‌‍ను బూతులు తిట్టి... నేడు అదే తప్పు చేసిన చంద్రబాబు
, ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (12:29 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని తేలిపోయింది. నలుగురికి నీతులు చెప్పే చంద్రబాబు.. చివరకు ఆ నీతికి, నైతిక విలువలకు కట్టుబడేందుకు ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లోనే కాడుండా వ్యక్తిగతంగా కూడా విలువలు పాటించే విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని, ఈ విషయంలో ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాజాగా ఆ విలువలకు తిలోదకాలిచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి తెరాసలోకి వెళ్లిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తీసుకున్నారు. దీన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే అంశంపై టీ టీడీపీ న్యాయపోరాటం కూడా చేస్తోంది. ఇపుడు ఇదే తప్పు చంద్రబాబు చేశారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన వారిలో నలుగురు జంప్ జిలానీలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. 
 
తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో అప్పట్లో గవర్నర్‌పైనా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు, పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీలో సమర్థులే లేరా, ఫిరాయింపు ఎమ్మెల్యేలే దొరికారా? అప్పుడు విమర్శించిన వారికి ఇప్పుడు పదవులా అని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపాలో చిచ్చురేపిన పునర్‌వ్యవస్థీకరణ : వైకాపాలోకి 15 మంది జంప్